నటి శ్రావణి ఆత్మహత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు?

బుల్లితెర నటి శ్రావణి(26) నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ నటి ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

ఈమె ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మనసు మమత, మౌనరాగం సీరియళ్ల ద్వారా శ్రావణి మంచి పేరు తెచ్చుకుంది.

తూర్పుగోదావరి జిల్లా గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి టీవీ సీరియళ్లలో నటించాలనే ఆకాంక్షతో చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్ కు వచ్చింది.పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ లో ఈమెకు తమ జిల్లాకే చెందిన దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

ఆ పరిచయం కాస్తా క్రమంగా ప్రేమగా మారింది.దేవరాజ్ పై ఉండే ప్రేమ వల్ల ఆమె అతనికి సీరియళ్లలో అవకాశాలు ఇప్పించింది.

Advertisement

అయితే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని.శ్రావణి పరువు తీస్తానని దేవరాజ్ తరచూ వేధించేవాడు.

తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడేవాడు.ఒక దశలో వేధింపులు ఎక్కువ కావడంతో శ్రావణి దేవరాజ్ పై పోలీస్ కేసు నమోదు చేసిందని.

అయితే కేసు నమోదు చేసిన కొన్ని రోజులకే ఆమె కేసు వాపస్ తీసుకుందని తెలుస్తోంది.శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆమె దేవరాజ్ ను ఒక రెస్టారెంట్ లో కలిసిందని సమాచారం.

శ్రావణి తల్లి పాపారత్నం దేవరాజ్ బెదిరింపుల వల్లే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.అయితే దేవరాజ్ మాత్రం తాను శ్రావణిని డబ్బులు డిమాండ్ చేయలేదని.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆమె ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదని చెప్పారు.ఆమె తల్లిదండ్రులు, సాయి అనే మరో వ్యక్తి శ్రావణి ఆత్మహత్యకు కారణమని గతంలో తాను, శ్రావణి డిన్నర్ చేయడానికి వెళ్లిన సమయంలో సాయి శ్రావణిపై చేయి చేసుకున్నాడని చెప్పారు.

Advertisement

పోలీసుల విచారణలో శ్రావణి ఆత్మహత్యకు సంబంధించి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు