చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పెద్దూరులో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

 Extreme Tension During Chandrababu's Visit To Kuppam-TeluguStop.com

దీంతో పోలీసులతో చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు.ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో -1 ప్రకారం రోడ్ షో, సభలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే రోడ్ షో కు అనుమతి లేదని చంద్రబాబుకు డీఎస్పీ నోటీసులు ఇచ్చారు.ఓ వైపు పోలీసుల వైఖరికి నిరసనగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు పోలీసుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తన నియోజకవర్గానికి కూడా వెళ్లినివ్వరా అంటూ డీఎస్పీపై మండిపడ్డారు.

రోడ్ షో ఎందుకు పర్మిషన్ ఇవ్వారంటూ ప్రశ్నించారు.ఇంతమంది ప్రజానీకాన్ని ఇబ్బంది పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ముందుకు వెళ్లనివ్వాలని పట్టుబట్టారు.

దీంతో పెద్దూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube