బోయినపల్లిలో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు చొప్పదండి ఏం ఎల్ ఏ గ సుంకే రవి శంకర్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు.

 Extensive Campaigning By Brs Leaders In Boinapally, Brs Campaigning ,brs Leaders-TeluguStop.com

నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సుంకే రవిశంకర్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.తెలంగాణ వచ్చిన తరువాత గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని,24 గంటల విద్యుత్,రైతు బీమా,రైతు బందు పథకాల తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది అని తెలిపారు.

మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి నీ చేయాలంటే సుంకే రవి శంకర్ ను గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ ,బిజెపి నాయకుల మాటలు నమ్మవద్దని వారి మాటలు మొత్తం మోస పూరితపు మాటలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగదని అన్నారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు ,ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎం చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి ,ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య , వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య,డాక్టర్ అమిత్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు కోనుకటి లచ్చి రెడ్డి, సేస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube