తెలుగు సినీ నటి టీడీపీ మాజీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఇటీవల టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.టిడిపి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఆ పార్టీలో ఉన్న లొసుగుల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తోంది.
అంతే కాకుండా సొంత పార్టీ లో పనిచేస్తున్న ఒక మహిళను అగౌరవపరిచడానికి టిడిపి పార్టీ వాళ్ళు ఎంత నీచానికైనా పాల్పడతారు అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యవాణి.
ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.ఆడదాని ఏడుపు ప్రభావం తర తరాల వరకు ఉంటుందని, పాప పుణ్యాలు వాళ్ళ బిడ్డలు కూడా అనుభవించేటట్లు ఆ దేవుడు చేస్తాడు అని తెలిపింది.
నాలా రోషంగా బ్రతికే దాన్ని బాధ పెట్టారు చంద్రబాబు. మీరు అనుభవిస్తారు.టిడిపి పార్టీ నుంచి వచ్చిన తర్వాత నేను సిలువ వేయబడ్డాడు.ప్రతి ఒక్కరూ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఎందుకు బయటకు వెళ్లారని అడుగుతున్నారు అని తెలిపింది దివ్యవాణి.
చంద్రబాబు లోకేష్ గారి వల్ల పార్టీ నుంచి ఎవరు బయటకు రారు వాళ్ళు చాలా మంచివాళ్ళు చుట్టూ ఉన్న దరిద్రుల వల్లే పార్టీ నుంచి బయటకు వస్తున్నారు.ఈ విషయంలో లోకేష్ గారు సమీక్షించుకోవాలి.
ఒకప్పుడు వల్లభనేని వంశీ గారి మధ్య భువనేశ్వరి గారి గురించి మాట్లాడినప్పుడు మేము చాలా బాధపడ్డాను అని తెలిపింది దివ్యవాణి.
అయితే ఆ పరిస్థితి తనవరకు వస్తేగానీ ఆ బాధ తనకు తెలియలేదని ఆమె తెలిపింది.

అలాగే టిడిపి పార్టీ వాళ్లే ఈ విధంగా చేస్తున్నారని టిడిపి పార్టీకి పనిచేసే ఎన్.ఆర్.ఐ శేఖర్ చిలుకూరి అనే ఒక వ్యక్తి వైసిపి వాళ్ళకి ఫోన్ చేసి మరి దివ్యవాణిని టిడిపి పార్టీ నుండి సస్పెండ్ చేసిందని పోస్ట్ పెట్టమని చెప్పాడట.ఎందుకు అని అడుగగా పార్టీలో డిస్కషన్ అవుతుంది నువ్వు పోస్టు పెట్టేయ్ అని అన్నారట.
అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని తెలిపింది దివ్యవాణి.అయితే ఆమె తీర పార్టీకి రిజైన్ చేసి ప్రెస్ మీట్ లో తన బాధ చెప్పుకున్న తర్వాత టిడిపి వాళ్ళు దారుణమైన పోస్టులు పెట్టడమే కాకుండా.
నువ్వు బాత్రూంలో స్నానం చేస్తూ.అయ్యన్నపాత్రుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో మా దగ్గర ఉంది అది బయటకు రిలీజ్ చేస్తానని బుచ్చయ్యచౌదరి అకౌంట్ నుంచి పోస్ట్ పెట్టారట.
అప్పుడు బుచ్చయ్యచౌదరి ఆమెకు ఫోన్ చేసి ఇలా పోస్ట్ పెట్టారు అది ఫేక్ అని చెప్పారట.







