తంగళ్ళపల్లి: హాత్ సే హాత్ జోడో యాత్రలో తంగళ్లపల్లి మండల ప్రజలందరూ భాగస్వాములు కావాలని యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మునిగిల రాజు ఓ ప్రకటనలో కోరారు .ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మండల కేంద్రంలో ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు , రైతులు, కార్మికులు, నిరుద్యోగులు,మండల ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని అన్నారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను అంతమొందచడానికే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.
వారి పక్షాన ప్రశ్నించే గొంతై పోరాడాటానికి వస్తున్న రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలకడానికి ప్రతి ఒక్క కార్యకర్త కదిలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్, ఆరేపల్లి బాలు, శ్రీనివాస్, తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







