శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది.నేటి సమావేశాల్లో ఈటలను సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దీన్ని అసెంబ్లీ కూడా ఆమోదించడంతో ఆయన సస్పెండ్ అయ్యారు.
ఈనెల 6 న స్పీకర్ పోచారంపై ఈటల మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ క్రమంలో స్పీకర్ కు ఈటల క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.ఇందుకు ససేమీరా అనడంతో ఆయనను సస్పెండ్ చేశారు.
అయితే ఈ సెషన్ వరకు సస్పెన్షన్ వర్తిస్తుందని స్పీకర్ తెలిపారు.