సాధారణ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నాయి.ఇప్పటికే ప్రజాక్షేత్రం లో తమ బలం మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ వ్యూహాలకు పదునుపెట్టాయి.అయితే మరోవైపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే దానిపై ఈసీ కసరత్తు చేస్తోంది.గతంలో మాదిరిగానే అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వీలుంది.ఏపీతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇంకా కొన్ని రాష్ట్రాలపై ఈసీ నిర్ణయం తీసుకోలేదు.అయితే సాధారణ ఎన్నికలను మొత్తంగా ఆరు ఏడు విడతలుగా నిర్వహించేందుకు ఎన్నికల సంగం కసరత్తు చేస్తోంది.