దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీఏ గోరంట్ల బుచ్చిబాబుకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు అందించనున్నారు.
మద్యం కుంభకోణంలో అరుణ్ పిళ్లైతో పాటు బుచ్చిబాబును కలిపి ఈడీ ప్రశ్నించనుంది.హవాలా నగదు తరలింపుపై పిళ్లైని విచారించాలని ఈడీ ఇదివరకే తెలిపింది.
సీబీఐ కేసులో బెయిల్ పై నిన్ననే గోరంట్ల బుచ్చిబాబు విడుదలైన విషయం తెలిసిందే.







