ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.డౌన్ పేమెంట్ లేకుండా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఏపీ నూతన పునురుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సమాచారం అందించింది.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని పేర్కొంది.ఒక్కో కిలో వాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేల చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుంది.దీంతో గ్రామ, సచివాలయ సిబ్బందికి మరింతగా ప్రయోజనం చేకూరనుంది.