బాధిత కుటుంబానికి అండగా నిలిచిన డాక్టర్ గోలి మోహన్!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మీసాల రాజేందర్ కుటుంబాన్ని శనివారం డాక్టర్ గోలి మోహన్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.రాజేందర్ కి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

 Dr. Goli Mohan Stood By The Victim's Family! , Dr. Goli Mohan , Rajanna Sircill-TeluguStop.com

వారి దీనస్థితిని చూసి ఈరోజు వారికి తాత్కాలికంగా 10000 రూపాయల ఆర్థిక సాయం చేసి రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలోని పిల్లలను చదువుకోవాలని దానికి నేను మీకు అండగా ఉంటానని మీరు ఎంతవరకు చదువుకున్న అంతవరకు ఆర్థిక సహాయం అందిస్తానని తర్వాత ఉద్యోగంలో ఉంచుతానని తెలియజేసి రాజేందర్ భార్య మమతకు మరో ధైర్యాన్ని నింపుతూ నేను ఎల్లవేళలా మీ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేశారు.

అదేవిధంగా గ్రామంలోని ప్రజలు మమత కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనందరం కలిసి ఈ కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు.

వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటానని ఎవరూ కూడా అధైర్య పడవద్దని ప్రతి ఒక్క కుటుంబానికి తోడ్పాటు అందిస్తూ కాపాడుకుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube