దుమాలకు వైద్య బృందం - ఇంటింటికి వైద్య పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి ప్రభుత్వ వైద్య బృందం వెళ్లి ఇంటింటికి రక్త పరీక్షలు నిర్వహించారు.

ఎల్లారెడ్డిపేట మండలం దుమాల లో శుక్రవారం ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ స్రవంతి రెడ్డి మాట్లాడుతూ సుమారు 74 మందిని పరీక్షించి మందులను పంపిణీ చేశారని తెలిపారు.అదేవిధంగా పది మందికి మలేరియా, రాఫిడ్ టెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

తమ సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరం పరీక్షలు నిర్వహించారని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదిరే రజిత శ్రీనివాస్ గౌడ్ , కార్యదర్శి మహేందర్, పి హెచ్ ఎన్ రజిని,సూపర్వైజర్ పద్మ, ఆరోగ్య సిబ్బంది నరేందర్,రమేష్ అనసూయ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News