ఈడీ కస్టడీలో డీఎంకే మంత్రి సెంథిల్ కు అనారోగ్యం ..!

చెన్నైలో హైడ్రామా నెలకొంది.మనీలాండరింగ్ కేసులో డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నిన్న బాలాజీ నివాసంలో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.మరోవైపు ఈడీ కస్టడీలో బాలాజీ అనారోగ్యానికి గురైయ్యారని తెలుస్తోంది.

ఈ క్రమంలో చికిత్స కోసం ఆయనను ఒమందురార్ ఆస్పత్రికి తరలించారు అధికారులు.ఆస్పత్రికి తరలించే సమయంలో కారులో మంత్రి బిగ్గరగా ఏడుస్తూ కనిపించారు.

అటు డీఎంకే నేతలు, మంత్రులు మరియు కార్యకర్తలు ఆస్పత్రి దగ్గరకు భారీగా తరలివచ్చారు.కాగా ప్రస్తుతం బాలాజీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలుస్తోంది.

Advertisement
ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు