కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో ఇదే విషయంపై డీకే శివకుమార్ మద్దతుదార్లతో చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని డీకే శివకుమార్ తెలిపారు.అదేవిధంగా సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.