బాలీవుడ్ లో మొన్నటివరకు సూపర్ ఫాం లో ఉన్న గ్లామర్ బ్యూటీ దిశా పటాని తను చేసే సినిమాల కన్నా తన బికినీ షోస్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది.తెలుగులో లోఫర్ సినిమా చేసిన అమ్మడు చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ Kలో నటిస్తుంది.
ఈ సినిమా చేస్తున్న టైం లో అమ్మడికి మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేయాలని అనిపిస్తుందట.దిశా పటాని టాలీవుడ్ కి ఆల్రెడీ పరిచయమే కాబట్టి అమ్మడు చేస్తా అనాలే కాని మన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస ఛాన్స్ లు ఇస్తారు.
ప్రాజెక్ట్ K రిలీజ్ టైం కన్నా కనీసం మరో రెండు తెలుగు సినిమాలు అయినా చేయాలని అనుకుంటుంది దిశా పటాని.అమ్మడు స్పెషల్ ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ మేకర్స్ కూడా దిశా పటానిని తెలుగు సినిమాల్లో తీసుకోవాలని చూస్తున్నారు.లోఫర్ రిజల్ట్ బాగుంటే కచ్చితంగా దిశా పటాని ఇక్కడ వరుస సినిమాలు చేసేదేమో కానీ ఆ సినిమా ఫెయిల్ అవడం మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేయలేదు.అయితే ప్రాజెక్ట్ కె మాత్రం దిశాకు మంచి ఛాన్స్ లు వచ్చేలా చేస్తుందని అంటున్నారు.
బాలీవుడ్ లో యంగ్ హీరోతో ప్రేమాయణం నడిపించిన అమ్మడు ఇప్పుడు సోలోగానే ఉంటున్నట్టు తెలుస్తుంది.