వైసీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం..మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు..

తుని వైసీపీ ఫ్లీనరీలో మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరు సంపాదించుకున్నారని అన్నారు.

 Disappointment Among Ycp Workers..minister Raja Interesting Comments  Ycp Worker-TeluguStop.com

అలాంటి భావనే మన కార్యకర్తల్లో కూడా కొంతమందికి ఉండేదని పేర్కొన్నారు.అయితే ముఖ్యమంత్రి జగన్ పారదర్శకమైన పరిపాలన అందించడంతో అది కుదరలేదని వ్యాఖ్యానించారు.

దీంతో కార్యకర్తలు, నాయకులు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారని అది వాస్తవమని మంత్రి అన్నారు.నేను కూడా మీలానే నిరుత్సాహానికి గురి అయ్యానంటూ కార్యకర్తలకి చెప్పుకొచ్చారు.

టీడీపీ హయాంలో ఏ పధకం అమలు కావాలన్నా జన్మభూమి కమిటీ మెంబెరే అమలు చేసేవారని గుర్తు చేసారు.అందుకే వారు బాత్రూముల పధకంతో పాటు మిగిలిన పథకాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube