త్వరలో గుడ్ న్యూస్ చెబుతాను అని అంటున్న డైరెక్టర్ శ్రీనువైట్ల

శ్రీను వైట్ల .

కామెడీ తన బలం శ్రీను వైట్ల సినిమా సినిమాలో కామెడీకి పెద్ద పీట వేస్తుంటారు , ఇక దూకుడు మూవీ తో ఇండస్ట్రీ హిట్ అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు డైరెక్టర్ శ్రీను వైట్ల.

టాప్ డైరెక్టర్స్ అయిన జంధ్యాల ,ఇ.వి.వి.సత్యనారాయణ గారి సినిమాల్లో కామెడీని చూసి ప్రేక్షకులు ఏ విధంగా నవ్వుకుంటారో , ఆ తరువాత కాలంలో అదే కామెడీ జానర్ ని నమ్ముకుంటూ తన టైమింగ్ ,తన మార్క్ ని నమ్ముకుంటూ తెర పై మరిన్ని నవ్వులు పూయించారు డైరెక్టర్ శ్రీను వైట్ల .దూకుడు మూవీ లోని సూపర్ స్టార్ మహేష్ బాబు లోని కామెడీ యాంగిల్ ని చక్కగా ప్రెజెంట్ చేసి ఇండస్ట్రీ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు.ఇక అసలు విషయానికి వస్తే .దూకుడు , బాద్షా మూవీ ల తరువాత చేసిన ఆగడు ,బ్రుస్ లీ , మిస్టర్ ,అమర్ అక్బర్ ఆంటోనీ , మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి .దూకుడు సినిమా ఫార్ములా వర్క్ అవుట్ అయినట్లు అన్ని మూవీస్ కి వర్క్ అవుట్ అవ్వవు ,స్టోరీ లో దమ్ము ఉండాలి ,అలానే స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా ఉంటే ప్రేక్షకుల దగ్గర నుండి విమర్శలు వస్తాయి .మాస్ మహారాజ్ రవితేజ - డైరెక్టర్ శ్రీను వైట్ల ది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ మూవీస్ వచ్చాయి , నీ స్నేహం మూవీ తో మొదలైన వీరి సినీ జర్నీ ఆ తరువాత వెంకీ ,దుబాయ్ శ్రీను , మూవీ వరుకు చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగింది .2017 లో డైరెక్టర్ శ్రీనువైట్ల - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ మూవీ మిస్టర్ .ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకుంది .మిస్టర్ మూవీ తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాస్ మహారాజ్ రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తెరకెక్కించారు ,చివరికి ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం అందుకుంది .ఇక ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీను వైట్ల ప్రేక్షకుల దగ్గర నుండి చాలా విమర్శలు అందుకున్నారు.

అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ ప్లాప్ అందుకున్నాకా శ్రీను వైట్ల టైమ్ అయిపోయింది అని ప్రేక్షకులు భావించారు.ఇక తానూ కూడా తానూ తెరకెక్కించిన సినిమాల్లో లోపాలు గుర్తించాను అని పలు సందర్భాల్లో తెలియజేశారు .ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న ఈ టాప్ డైరెక్టర్ పేరు ప్రేక్షకులు మర్చిపోతున్నారు శ్రీను వైట్ల సినిమా అంటేనే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే టాక్ నుండి పూర్తిగా ప్లాప్ డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది .ఇక అమర అక్బర్ ఆంటోనీ మూవీ తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని సినిమా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది , ఇక అమర అక్బర్ ఆంటోనీ మూవీ దెబ్బ గట్టిగా తగిలినాకా శ్రీను వైట్ల తో సినిమా చేయడానికి ఏ స్టార్ హీరోలు ముందుకు రావడంలేదు , అలానే ఈ గ్యాప్ లో మూడు స్టోరీస్ ని రెడీ చేసినట్లు కొన్ని వార్తలు వినిపించాయి , వాటిలో ఒకటి మంచు విష్ణు ,కొసం ఢీ మూవీ సీక్వెల్ , అలానే హీరో రామ్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ , అఖిల్ కోసం ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ ఒకటి , అయితే వీటిలో ముందు మంచు ఢీ అంటే ఢీ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు, కానీ ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు .

అలానే మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ తో ఒక యాక్షన్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి .అసలు డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంకా సినిమాలు చేయడం ఆపేశాడా అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఇక వాస్తవానికి మంచు విష్ణు తో ఢీ అంటే ఢీ అనే సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ అయింది ,గాని ఈ సినిమా నుండి ఒక్క టైటిల్ టీజర్ తప్పితే ఎటువంటి అప్ డేట్ రాలేదు , అలానే జిన్నా మూవీ తర్వాత మంచు విష్ణు నటించే ఈ సినిమా గురుంచి న్యూస్ కోసం ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు .ఇక ఈ టాప్ డైరెక్టర్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి త్వరలనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు .

Advertisement
సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్

తాజా వార్తలు