ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో సాగిస్తున్న అరాచకాలు సొసైటీ లో పెరిగిపోయాయి.అమ్మాయిల వెంట ప్రేమించానని వెంట పడటం.
కాస్తా చనువుగా ఉంటే అదే ప్రేమ అని అనుకోవడం.ప్రేమించడం లేదని చెబితే దారుణానికి ఒడిగట్టడం చేస్తూ ఉన్నారు.
ఇలాంటి ప్రేమోన్మాదుల దాడులలో ఈ మధ్య కాలంలో తరుచుగా అమ్మాయిలు బలైపోతున్నారు.ఒకప్పుడు నల్గొండ యాసిడ్ దాడుల నుంచి నేటి వరకు ప్రేమ పేరుతో ప్రేమోన్మాదులు సాగిస్తున్న అరాచకం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో మరో సారి ప్రేమోన్మాది దాడి జరిగింది.
దిల్ సుఖ్ నగర్ లో బృందావన్ లాడ్జ్ లో ఓ యువకుడు, యువతి గొంతు కోసేసి తాను కూడా ఆత్మహత్యాప్రయత్నం చేసాడు.
నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్, హైదరాబాద్ బడంగ్ పేటకు చెందిన మనస్విని గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే, ఇవాళ ఉదయం ఇద్దరు కలిసి బృందావన్ లాడ్జ్ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు.
అయితే వారిద్దరి మధ్య ఏమైందో ఏమో తెలియదు కాని మధ్యాహ్న సమయంలో యువతి గొంతు కోసి తరువాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుంది.ఇక అతనికి కూడా చికిత్స అందిస్తున్నారు.