ఆఫర్‌ వస్తే బాలీవుడ్‌కు సిద్దం

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

ఈయన ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

బాలీవుడ్‌లో భారీ స్థాయిలో ఈయనకు క్రేజ్‌ దక్కింది.దాంతో ప్రభాస్‌ బాలీవుడ్‌ వెళ్లడం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

‘ధూమ్‌’ సిరీస్‌లో ప్రభాస్‌కు అవకాశం వచ్చిందని, ఆ సినిమాలో ప్రభాస్‌ నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి.ఆ మధ్య మహీంద్ర యాడ్‌లో ప్రభాస్‌ కనిపించిన సమయంలో బాలీవుడ్‌ హీరోల ఉన్నాడు అంటూ నేషనల్‌ మీడియా సైతం కథనాలు రాసింది.

దాంతో ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.తాజాగా బాలీవుడ్‌ ఎంట్రీపై ప్రభాస్‌ స్పందిస్తూ.

Advertisement

తనకు ఇప్పటి వరకు బాలీవుడ్‌ నుండి ఎలాంటి బిగ్‌ ఆఫర్స్‌ రాలేదు అని, ఒక వేళ నన్ను ఆకట్టుకునే ఆఫర్లు వస్తే తప్పకుండా నటిస్తాను అని, బాలీవుడ్‌ వెళ్లడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం ఉంటుందని, అలాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ప్రభాస్‌ అంటున్నాడు.దాంతో ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయం అంటూ ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

అయితే ‘బాహుబలి’ తర్వాత తాను తెలుగులోనే నటించనున్నాను అని, ఆ తర్వాత బాలీవుడ్‌ నుండి క్రేజీ ఆఫర్‌ వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు.గత సంవత్సరంలో విడుదలైన బాహుబలి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ ఈ సంవత్సరం విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

బాలీవుడ్ లో జోరుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీస్..
Advertisement

తాజా వార్తలు