గుజరాత్ ఎన్నికలతో జాతీయ పార్టీ హోదా సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దక్షిణ భారత దేశంపై ఫోకస్ పెట్టింది.తెలంగాణా వేదికగా దక్షిణ భారతంపై పట్టు బిగించాలని చూస్తున్నారు.
దాని కోసం తెలంగాణాలో ఇప్పటికే వడివడిగా పావులు కదుపుతూ ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కేజ్రీవాల్ మంచి సాన్నిహిత్యం ఉంది.
దీన్ని వాడుకుని.ఏపీలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో ఇప్పటికే పార్టీ కన్వీనర్ను నియమించి పాలిటిక్స్ మొదలు పెట్టారు.సీఎం కేసీఆర్ సైతం రాబోయే ఎన్నికల్లో ఐదు సీట్ల వరకూ కేజ్రీవాల్ పార్టీకి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ పార్టీతో బంధాన్ని కొనసాగిస్తూ.ఏపీలో రెండు పార్టీలు కలిపి పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఏపీలో ఉన్న నేతలతో పాటు.మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ అధికారులపై ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుండటంతో.ఒంటరిగా కాకుండా.
కేజ్రీవాల్ సాయంతో కలసి అడుగులు వేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ కేజ్రీవాల్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.
మరో నెల రోజుల్లో ఆయన ప్రకటన విడుదల చేయనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఏపీలో పార్టీకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సరైన నేతను వెతికేందుకు.ఆప్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ప్రత్యక్షంగా కాకుండా.
బీఆర్ఎస్ నేతలకు ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.సరైన నేత ఏపీలో దొరికితే సీఎం కేసీఆర్ మాదిరి.
అధ్యక్షుడిగా నియమించి పార్టీ కార్యక్రమాలను మొదలు పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.మరి కేజ్రీవాల్ ఏపీలోనూ చక్రం తిప్పితే.
త్రిముఖ పోరు కాస్తా.చతుర్ముఖ పోరుగా నిలవడం ఖాయం.