కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదు.. టీడీపీ నేత బోండా కీలక వ్యాఖ్యలు

విజయవాడలో కాపు నేతల భేటీ వార్తలపై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు.స్నేహ పూర్వకంగా జరిగిన సమావేశాన్ని వక్రీకరిస్తున్నారన్నారు.

ఇలాంటి వార్తలతో కొందరు వైసీపీ నేతలకు నిద్ర కూడా పట్టదని విమర్శించారు.ఇది సాధారణ సమావేశమన్న ఆయన రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు.

ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా కలిశామని తెలిపారు.విశాఖలో కాపునాడు సమావేశంపై చర్చ రాలేదని వెల్లడించారు.

పార్టీ మారే అంశాన్ని గతంలోనే ఖండించానని గంటా చెప్పారని పేర్కొన్నారు.కన్నా కూడా నాదెండ్లతో వ్యక్తిగత సంబంధాలతో కలిశామన్నారు.

Advertisement

కాపులు వైసీపీని నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు