కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది.అశోక్ గెహ్లాట్, శశిథరూర్ అధ్యక్ష రేసులో ఉంటారని అనుకోగా ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ పేరు కూడా వినిపిస్తుంది.
ఎన్డీటీవీతో ఇచ్చిన ఇంటార్వ్యూలో తను కూడా పోటీలో ఉన్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.ఈ ప్రకటనతో ఆయన కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారా అనే ఊహాగానాలు వస్తున్నాయి.
దీంతో పాటు అశోక్ గెహ్లాట్పై కూడా దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే రాజస్థాన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఇది మాత్రమే కాదు, ఇదే జరిగితే అతని స్థానంలో సచిన్ పైలట్ ఖచ్చితంగా చోటు దక్కించుకోగలడని అన్నాడు.
ఈ ఏడాది ఉదయ్పూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
అధ్యక్షుడిగా ఎన్నికైతే అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.ఈ సమయంలో, మధ్యప్రదేశ్ ఉదాహరణను ఇస్తూ కమల్ నాథ్ తన పదవిని ఆ విధంగానే వదిలివేయవలసి వచ్చిందని అన్నారు.మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వంపై దిగ్విజయ్ సింగ్ కీలక సూచనలు చేశారు.30వ తేదీ సాయంత్రంలోగా అన్నీ విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థుల నామినేషన్కు ఇదే చివరి రోజు.

గాంధీ కుటుంబంలో ఎవరూ రేసులో లేరని మధ్యప్రదేశ్ మాజీ సీఎం అన్నారు.ఎన్నికల్లో పోటీ చేపే హక్కు ఎవరికైన ఉంటుందన్రారు.అయితే ఇక్కడ ఎవరీని బలవంతం చేయడం లేదన్నారు.
ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.అప్పటి నుండి సోనియా గాంధీ తాత్కలిక అధక్ష్యురాలిగా కొనసాగుతున్నారు.
రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని తిరస్కస్తున్నారు.రాహుల్ గాంధీ అంగీకరిస్తే మంచిదని, లేకుంటే తను నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ ఈరోజు తెలిపారు.







