ఫ్లెక్సీల తొలగింపు పై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం.

ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీసిన నాయకులు.

రాజన్న సిరిసిల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపు పై కాంగ్రెస్ పార్టీ( Congress party ) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఫ్లెక్సీల తొలగింపు విషయం తెలుసుకున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్( Srinivas ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు.అనుమతి తీసుకొని కట్టిన ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారంటూ అధికారులను నిలదీశారు.

అధికార పార్టీ ఫ్లెక్సీలు తొలగించకుండా కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తో పాటు నాయకులు డిమాండ్ చేశారు.

నిరసనలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూరదేవరాజు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News