తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆరు గ్యారెంటీల( Six guarantees )పై కాంగ్రెస్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోందని విమర్శించారు.
ఇండియా కూటమి నుంచి అన్ని పార్టీలు వెళ్లిపోతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు.బీజేపీ( BJP )ని ఓడించే సత్తా కాంగ్రెస్ లేదన్నారు.గతంలో వచ్చిన సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు.అలాగే కేంద్రం కృష్ణా జలాల్లో మన వాటా తేల్చలేదని తెలిపారు.మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి కృష్ణా జలాలను అప్పగించారని మండిపడ్డారు.420 దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) బీఆర్ఎస్ గెలవాలన్నారు.ఢిల్లీలో తెలంగాణ మాట వినిపించాలంటే బీఆర్ఎస్ విజయం సాధించాలని తెలిపారు.