పెద్దోళ్లు దర్యాప్తు చేయాలి

నోటుకు ఓటు కుంభకోణంపై ప్రస్తుతం చిన్నోళ్లు (తెలంగాణ ఏసీబీ) దర్యాప్తు చేస్తున్నారని, ఈ కేసును పెద్దోళ్లు (సిబీఐ) దర్యాప్తు చేయాలని కాంగ్రెసు డిమాండ్‌ చేసింది.ఈ కేసును సిబీఐ చేత దర్యాప్తు చేయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరాలని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు.

 Congress Demands Cbi Inquiry In Cash-for-vote Case-TeluguStop.com

రాజ్యాంగ సంక్షోభం రావాలని తాము కోరుకోవడం లేదన్నారు.ఇది చాలా సున్నితమైన కేసు కాబట్టే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు.

సిబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి హైదరాబాద్‌ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలన్నారు.ఈ పని చేయకపోతే సీబీఐ దర్యాప్తు కోరుతూ రెండు తెలుగు రాష్ర్టాల కాంగ్రెసు కమిటీలు హైకోర్టులో పిటిషన్‌ వేస్తాయని డిగ్గీ రాజా చెప్పారు.

నోటుకు ఓటు కుంభకోణం తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.ఎంతో అనుభం ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కేసు విషయంలో పరపక్వత లేనివిధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందా? లేదా? అనే విషయం కేసీఆర్‌ చెప్పాలన్నారు.ఈ కేసు విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజీ పడతారని దిగ్విజయ్‌కు అనుమనంగా ఉన్నట్లుంది.

అందుకే సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేస్తున్నారు.ఇందుకు కేంద్రం ఒప్పుకుంటుందా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube