టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కమిషన్ జాప్యం చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ అంశంలో ఇప్పటివరకు ఒక్క అధికారికి కూడా కమిషన్ మెమోను కూడా జారీ చేయలేదు టీఎస్పీఎస్సీ.
శాఖా పరమైన చర్యలకు వెనుకాడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అదేవిధంగా కాన్ఫిడెన్షియల విభాగాన్ని సెక్షన్ ఆఫీసర్ స్థాయి అధికారికి అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.
కనీసం అంతర్గత విచారణ కూడా జరపకపోవడంపై టీఎస్పీఎస్సీ రద్దు చేయాలంటూ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.