మా ఆయనను పక్కకు తీసుకెళ్లి రెండు గుద్దులు గుద్దాను.. హేమ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి లేడీ కమెడియన్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తూ హేమ మంచి పేరును సంపాదించుకున్నారనే విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాల ద్వారా నటిగా హేమకు పాపులారిటీ పెరిగింది.

ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్టు హేమ చేసిన ప్రకటన వల్ల, ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల వల్ల వార్తల్లో నిలిచారు.అయితే తాజాగా హేమ ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు హాజరయ్యారుహేమ ఈ షోకు గెస్ట్ గా హాజరయ్యారు.

ఇమ్మాన్యుయేల్ సుడిగాలి సుధీర్ తో ఎవరు వీళ్లు? అని అడగగా దారిలో వస్తుంటే తగిలారురా అని చెబుతాడు.ఇమ్మాన్యుయేల్ వెంటనే దారిలో తగిలార .? లేక నీ దారిలోకి వచ్చారా ? అని కామెంట్ చేస్తాడు.హేమ వీళ్లెవరు అని అడగగా కిట్టీ పార్టీ అన్నారు కదా అందుకే తీసుకొచ్చానని చెబుతాడు.

ఇంతకూ మీ వారేరి ? అని సుధీర్ అడగగా నీలాగే పక్కచూపులు చూస్తుంటే పక్కకు తీసుకొని వెళ్లి రెండు గుద్దులు గుద్దానని హేమ వీ చెబుతారు.దీనిని బట్టి నీకేం అర్థమైందని సుధీర్ ను హేమ అడగగా మీరు ఫ్రీగా ఉన్నారని అర్థమైందంటూ హేమతో సుధీర్ చెబుతాడు.ఇంద్రజ ఫోక్ సాంగ్ కు స్టెప్పులు వేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు.

Advertisement

అమ్మానాన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడూ హృదయంలోనే ఉంటారంటూ ఇంద్రజ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ఒకరిపై మరొకరు వేసుకున్న పంచ్ లు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి.ఒసేయ్ రాములమ్మ సినిమాలోని పాటకు రోహిణి అదిరిపోయే రేంజ్ లో పర్ఫామెన్స్ చేశారు.ఈ ఆదివారం మధ్యాహ్నం 1.00 గంటకు ఈ షో ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు