రాజన్న సిరిసిల్ల జిల్లా: కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని( Grain) త్వరగా తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) ఆదేశించారు.
చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, మల్యాల, రుద్రంగి మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.