ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన స్వల్ప మార్పులతో కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చిస్తున్నారు.ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.
భేటీ అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారని సమాచారం.







