ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొగుండాలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.సీఆర్పీఎఫ్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు.
ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరపగా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.మరి కొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
సీఆర్పీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది.కాగా మావోయిస్టుల మృతిని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు.