చిత్తూరు పోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది.కన్న కూతురిపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు విధించింది.2018లో పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో తీర్పు వెలువరించింది.కృష్ణమూర్తి అనే కామాంధుడు కూతురిపై మూడు ఏళ్లుగా పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు.
నేరం రుజువు కావడంతో నిందితుడు కృష్ణమూర్తి, అతనికి అండగా నిలిచిన భార్య ధనమ్మలకు పోక్సో కోర్టు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధించింది.అదేవిధంగా బాధితురాలికి మూడు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.







