చిరు తుంటరి ట్వీట్‌తో పూరి చెంప పగిలిందట

ట్విట్టర్‌లో ఎంటర్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవి జోరుగా ట్వీట్స్‌ చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు.

చిరంజీవి ట్విట్టర్‌లో ఎంటర్‌ అవ్వడంపై చాలా మంది ఆనందంను వ్యక్తం చేస్తూ ఆయనకు వెల్‌కం పలికారు.

తనకు వెల్‌కం పలికిన సెలబ్రెటీలకు విభిన్నంగా థ్యాంక్స్‌ చెప్పాడు.ఆ క్రమంలో పూరి జగన్నాధ్‌ చెప్పిన వెల్‌కంకు చిరంజీవి చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆ ట్వీట్‌ పూరి ఇమేజ్‌ బ్యాడ్‌ చేసేలా ఉందనే విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.

ఈ కరోనా కారణంగా థాయిలాండ్‌, బ్యాంకాక్‌ బీచ్‌లను నువ్వు బాగా మిస్‌ అవుతూ ఉంటావు కదా అంటూ సరదాగా తుంటరి ట్వీట్‌ను మెగాస్టార్‌ చేశాడు.ఆ ట్వీట్‌పై దర్శకుడు పూరి స్పందించాడు.ఈ ట్వీట్‌ చూసిన సమయంలో నా భర్య పక్కనే ఉంది.

Advertisement

ట్వీట్‌ను చూసి నా చెంప పగులగొట్టింది అంటూ పూరి కామెంట్స్‌ చేశాడు.చిరంజీవి గారు ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడో నాకే అర్థం కాలేదు అంటూ పూరి అసహనం వ్యక్తం చేశాడు.

కొత్త సినిమా మొదలు పెట్టాలంటే నెల రెండు నెలల పాటు పూరి థాయిలాండ్‌ బ్యాంకాక్‌ వెళ్లి వస్తాడు.అక్కడ ప్రశాంతంగా స్క్రిప్ట్‌లు రాసుకుని వస్తాడు.

ఆ తర్వాత షూటింగ్స్‌ మొదలు పెడతాడు.తన సినిమాల కథల నేపథ్యంను కూడా ఎక్కువగా అక్కడే ఎంచుకుంటాడు.

కనుక షూటింగ్స్‌ను ఎక్కువగా అక్కడే షూట్‌ చేస్తాడు.భవిష్యత్తులో బ్యాంకాక్‌లోనే సెటిల్‌ అవ్వాలని ఉంది అంటూ గతంలో పూరి ఒకసారి అన్నాడు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
కజకిస్తాన్‌లో ఇండియన్ టూరిస్ట్‌కి షాక్.. రూ.170 రైడ్‌కి రూ.5,000 కాజేసిన టాక్సీ డ్రైవర్..

అందుకే చిరు తుంటరిగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు.కాని పూరికి మాత్రం ఆ ట్వీట్‌ పరువు తీసింది.

Advertisement

తాజా వార్తలు