ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆత్మకూరు ఆస్పత్రికి వెళ్లిన ఆయన మెరుగైన చికిత్స కోసం చెన్నైకి వెళ్లనున్నారు.
అనారోగ్యం కారణంగా ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు ఎమ్మెల్యే మేకపాటి తెలిపారు.ఇప్పటికే తనకు మూడు స్టంట్లు వేశారన్న ఆయన రాత్రి పెయిన్ వచ్చిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆరోగ్యమే ముఖ్యమన్న ఆయన హెల్త్ కుదుటపడితే రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు.మరోవైపు ఉదయగిరి బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మేకపాటి సవాల్ ను స్వీకరించిన చేజర్ల సుబ్బారెడ్డి, ఆయన వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.