2000 నోట్లు రద్దు ఆర్బీఐ ప్రకటన పై చంద్రబాబు స్పందన..!!

₹2000 నోట్లను( Rs 2000 Denominations ) రద్దు చేస్తూ ఆర్బీఐ ( RBI ) సంచలన ప్రకటన చేయడం తెలిసిందే.ఈ క్రమంలో ₹2000 నోట్లు కలిగివున్న ప్రజలు సెప్టెంబర్ 30లోగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించడం జరిగింది.

 Chandrababu Response To Rbi Announcement Of Demonetisation Of 2000 Notes Details-TeluguStop.com

మే 23వ తారీకు నుంచి ఆర్బీఐ రీజినల్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు అని పేర్కొంది.అయితే ₹2000 నోట్లు రద్దు ఆర్బీఐ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) స్పందించారు.₹2000 నోట్లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇదే సమయంలో ₹500 రూపాయల నోట్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఇలా చేయటం వల్లే రాజకీయ నేతల అవినీతి తగ్గుతుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో తానే డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు.

కేంద్రం ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది.మనీలాండరింగ్ నియంత్రణ జరగాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 30లోగా ₹2000 నోట్లను ఏ బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేసి మార్చుకోవచ్చు.ఒక బ్రాంచ్ లో ఒకేసారి గరిష్టంగా ₹20వేలు మార్చుకోవచ్చని.

అప్పటిదాకా ₹2000 నోట్లు చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube