ఉమ్మడి చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ‘రా కదలి రా’( Raa Kadali Ra ) సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీకి పట్టిన శని వైసీపీ( YCP ) అని విమర్శించారు.వైసీపీ సర్కార్ ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం వేస్తోందని మండిపడ్డారు.
అయితే ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా చూడాలన్నది తన జీవిత ఆశయమని పేర్కొన్నారు.ఈ క్రమంలో ప్రజలు మరో అవకాశం ఇస్తే తాను చేసి చూపిస్తానని పేర్కొన్నారు.ఐదు కోట్ల మంది ప్రజల కోసం పని చేస్తానని వెల్లడించారు.యువత, మహిళలు ఉంటే గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.