దీక్షకు సిద్ధమైన చంద్రబాబు నాయుడు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం వైఎస్ జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

పట్టాభి వ్యాఖ్యలు చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు జరగటంతో.

ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు దాడులు జరిగిన అనంతరం ఏపీ బంద్ కి పిలుపునివ్వడం తెలిసిందే.

కాగా తాజాగా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేయడానికి చంద్రబాబు పునుక్కోవడం జరిగింది.రేపు ఉదయం 8 గంటల నుండి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు దీక్ష చేయనున్నారు.

ధ్వంసమైన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం లోనే.చంద్రబాబు దీక్ష చేయనున్నారు.ఇదిలా ఉంటే మరో పక్క ఈ దాడులకు సంబంధించి.

Advertisement

తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు.కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నారు.

శనివారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఏది ఏమైనా పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితిలో.

చంద్రబాబు లేనట్లు తెలుస్తోంది.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు