Chandrababu Naidu : వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలి..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu naidu ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో జగన్ అక్రమాలను నమ్ముకున్నారని ఆరోపించారు.

వైసీపీ కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు సి- విజిల్ యాప్( cVIGIL Mobile APP ) ద్వారా ఫిర్యాదులతో వైసీపీ ( YCP )అక్రమాలకు చెక్ పెట్టాలని చెప్పారు.

అదేవిధంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఎన్నికల నిబంధనలు సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని తెలిపారు.

డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టడం, ప్రభుత్వ ఉద్యోగులతో కోడ్ ఉల్లంఘనలపై సి -విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.జగన్( YS Jagan ) రివర్స్ పాలనతో యువత ఎక్కువ నష్టపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు

తాజా వార్తలు