వందే భారత్ ట్రైన్‌కు స్లీపర్, మెట్రో వెర్షన్‌లను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోన్న కేంద్రం!

భారతీయ రైల్వే శాఖ( Indian Railways ) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వందే భారత్ రైలు యొక్క రెండు కొత్త వెర్షన్లను పరిచయం చేయడానికి.ఈ మేరకు ఆల్రెడీ ఒక ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేయడం మొదలు పెట్టింది.

 Center Working To Bring Sleeper And Metro Versions To Vande Bharat Train! Indian-TeluguStop.com

చెన్నై( Chennai )లోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఈ రైళ్లను ఉత్పత్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం పని చేస్తున్న కొత్త వెర్షన్‌లను వందే భారత్ స్లీపర్, వందే మెట్రో అని పిలుస్తారు.

మరోవైపు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్( Ashwini Vaishnaw ) ఇటీవల ఐసీఎఫ్‌ని సందర్శించి ఈ కొత్త రైళ్ల ఉత్పత్తి బాగా జరుగుతోందని చెప్పారు.ICFతో పాటు మరో రెండు ఫ్యాక్టరీలు, రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ, లాతూర్‌లోని మరఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా ఈ రైళ్లను తయారు చేయడంలో సహాయపడతాయి.2023, ఆగస్టు 15 నాటికి ఈ కొత్త రైళ్లలో 75 సర్వీసులను ప్రారంభించడమే లక్ష్యం.ప్రస్తుతం దేశంలో వివిధ మార్గాల్లో 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.

ఈ రైళ్లు వేగం, అధునాతన సౌకర్యాలతో బాగా పాపులర్ అయ్యాయి.

వందే భారత్ స్లీపర్ వెర్షన్‌( Vande Bharat sleeper version)ను 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఇది రాజధానిలు, దురంతోస్ వంటి ప్రస్తుత సూపర్ ఫాస్ట్ రైళ్లను భర్తీ చేస్తుంది.స్లీపర్ వెర్షన్ ఫిబ్రవరి 2024 నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఇక వందే మెట్రో వెర్షన్ 100 కిలోమీటర్ల కంటే తక్కువ దూరాలకు ఉపయోగిస్తారు.ఇది చివరికి సబర్బన్, నాన్-సబర్బన్ ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న లోకల్ రైళ్లను భర్తీ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube