కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
పిటిషన్ పై భాస్కర్ రెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి కౌంటర్ దాఖలు చేయలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ తో పాటు వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ పై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నారు.