బస్సుల కోసం భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం అధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ లో భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో రాస్తా రోకో ధర్నాను విద్యార్థులతో కలిసి నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ బస్సులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

 Brs Student Union Leaders Protest For Buses In Rajanna Sircilla, Brs Student Uni-TeluguStop.com

గంటల కొద్దీ ఎదురు చూపులు చూస్తున్నారు.దీని వల్ల కొన్ని క్లాస్ లకు అటెండ్ కాలేక పోతున్నారు.

అంతే కాకుండా విద్యార్థులకు పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని పలుమార్లు ఆర్టీసీ డిపో అధికారులను కోరడం జరిగింది.

ఇప్పటికి అయిన విద్యార్థుల బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అదనంగా బస్సులు వేయాలని డిమాండ్ చేశారు.

బస్సులు వేయని ఎడల విద్యార్థులతో కలిసి డిపో ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.ఆర్టీసీ అధికారులు దీనికి స్పందించి సరియైన సమయంలో బస్సులు నడిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ నరేష్ జగన్ తిరుపతి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube