ఎన్నికల్లో భాగంగా పోలీస్ కవాతు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో ఎన్నికల్లో భాగంగా బిఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిరిసిల్ల రూలర్ సీఐ సదన్ కుమార్, హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో నిర్వహిస్తున్న బందోబస్తులో ముస్తాబాద్ తేర్లుమద్ది లో బిఎస్ఎఫ్ ఫోర్స్ తో కవాతు నిర్వహించామని తెలిపారు.

 Brs Force Flag March At Mustabad Mandal, Brs Force Flag March ,mustabad Mandal,-TeluguStop.com

మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన పోలీస్ కవాతు కొత్త బస్టాండ్ చౌరస్తా, పాత బస్టాండ్,

మార్కెట్, పెద్ద బజార్, మీదుగా హై స్కూల్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, వరకు కవాతు కొనసాగించారు, ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండలంలోని పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మక మైనవిగా గుర్తించినందున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు, ప్రజలందరూ స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube