సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.కుప్పంలోని నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఆయన ఉదయం పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన వాహనంపై నుంచి కిందపడ్డారు.దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అత్యవసర చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు.