ప్రెజెంట్ ఇండియా మొత్తం ఒకే ట్రెండ్ నడుస్తుంది.అదే పాన్ ఇండియా ట్రెండ్.
ఏ ఇండస్ట్రీ చుసిన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అన్ని బాషల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఈ సినిమాలు వందల కోట్ల మార్క్ ను అందుకుని ఆశ్చర్య పరుస్తున్నాయి.
మరి పెద్ద హీరోల సినిమాలు అయితే రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ ను అందుకుంటున్నాయి.
మరి మొదటి రోజే వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి.బాహుబలి 2, కేజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాలు ఉన్నాయి.ఈ నాలుగు సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ రాబట్టాయి.ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఫస్ట్ వీక్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచినా సినిమాల్లో బాహుబలి 2, కెజిఎఫ్ 2 సినిమాలు ఉండేవి.కానీ ఇప్పుడు మన సౌత్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ముందు వరుసలోకి వచ్చింది.కరోనా తర్వాత షారుఖ్ పఠాన్ మాత్రం 100 కోట్లు దాటి వసూళ్లు రాబట్టింది.ఎన్నో సినిమాలను రిజక్ట్ చేసిన బాలీవుడ్ ప్రేక్షకులకు స్పై థ్రిల్లర్ గా వచ్చిన పఠాన్ సినిమా బాగా నచ్చింది.
దీంతో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.రెండో వారంలోనే ఏకంగా 800 కోట్ల మార్క్ కు చేరువయ్యింది.ఇది బాలీవుడ్ నుండి 1000 కోట్లు అందుకున్న సినిమాగా నిలుస్తుంది అని భావిస్తున్నారు.ఇలా మొదటి వారంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో పఠాన్ సినిమా 351 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత 268 కోట్లతో కేజిఎఫ్ 2, 247 కోట్లతో బాహుబలి 2 రెండు మూడు స్థానాల్లో నిలువగా.నాలుగవ స్థానంలో సల్మాన్ సుల్తాన్ మూవీ 229 కోట్లతో నిలిచింది.