ఆ ఒక్క మాటతో మళ్ళీ ట్రోల్ అవుతున్న షణ్ముఖ్.. ఎందుకు ఆ వంకర బుద్ది అంటూ?

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి నిన్నటితో శుభం కార్డు పలికింది.

గ్రాండ్ ఫైనల్ కు చేరుకోవడం తో ప్రతి ఒక్కరూ టైటిల్ విన్నర్ కోసం బాగా ఎదురుచూశారు.

మొత్తానికి ఈ సీజన్ లో సన్నీ టైటిల్ విన్నర్ గా గెలిచి తానేంటో నిరూపించుకున్నాడు.ప్రేక్షకులు సైతం సన్నీ విన్ అవటంతో తెగ మురిసిపోయారు.

నిజానికి ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్   గెలుస్తాడు అని అనుకున్నారు.కానీ చివరికి అతడే రన్నరప్ గా అయ్యాడు.

ఎందుకంటే ఈయన బిగ్ బాస్ హౌస్ లో తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.చాలా వరకు షణ్ముఖ్ కు స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది.

Advertisement

సోషల్ మీడియా ద్వారా పరిచయమైన షణ్ముఖ్ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి స్టార్ హోదాను సంపాదించుకున్నాడు.అంతే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక ఈయన మరో సోషల్ మీడియా సెలబ్రిటి దీప్తి సునయన తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు.ఇక ఈయనకు, దీప్తి సునయన కు మంచి పేరు రావడంతో వీరిద్దరూ మరింత సెలబ్రెటీ హోదాను సంపాదించుకున్నారు.

వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహితం చూసి అందరూ వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనుకున్నారు.మొత్తానికి అది బిగ్ బాస్ షో ద్వారా బయటపడింది.

ఈ షో వల్లే వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నట్లు క్లారిటీ రావటంతో తమ ఫ్యామిలీ కి కూడా ఆ రోజే నిజం తెలిసింది.ఇదిలా ఉంటే ఈ సీజన్ ప్రారంభం కాకముందు షణ్ముఖ్ ఇందులో పాల్గొంటాడని తెలిసినప్పటినుంచి ఎంతో మంది అభిమానులు ఈ షో కోసం ఎదురు చూశారు.మొత్తానికి హౌస్ లోకి అడుగు పెట్టాక షన్ను కు బాగా ఫాలోయింగ్ ఏర్పడింది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కానీ మధ్యలో కి వచ్చేసరికి మరో కంటెస్టెంట్ సిరి తో చేసిన రచ్చతో అతని క్యారెక్టర్ ని పూర్తిగా బ్యాడ్ అని నిరూపించుకున్నాడు.తను దీప్తి తో ప్రేమలో ఉన్న కూడా సిరితో అలా ప్రవర్తించటంతో అందరూ అతడిని విమర్శించారు.

Advertisement

పైగా సిరి కూడా మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.

అదే సమయంలో వీరిద్దరూ సన్నీని బాగా టార్గెట్ చేశారు.సన్నీ ని బ్లేమ్ చేయాలని సిరి చాలా ప్రయత్నించింది.కానీ సన్నీ క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చటంతో అతడిని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు.

షన్ను ని విమర్శించడం మొదలుపెట్టారు.దాంతో సన్నీ టైటిల్ విన్నర్ గా గెలిచాడు.

ఇక రన్నరప్ గా ఉన్న షన్ను కు కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు నాగార్జున.దీంతో షన్ను మాట్లాడుతూ.పర్లేదు.

ఏం పర్లేదు.విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.

ఆట ఎలా ఆడాలి అన్నదే ముఖ్యం.పర్లేదు నేను అదే నమ్ముతాను.

అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు.ఇక్కడి  వరకు తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు.

దీంతో ఇతడు మాట్లాడిన మాటలు బట్టి నెటిజన్లు చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు.అంటే గెలవడం ముఖ్యం కాదా.

బిగ్ బాస్ హౌస్ కి దేనికోసం వచ్చినట్టు.రోమాన్స్ లు చేయడానికా.

అంటూ ఎందుకు ఇంత వంకరబుద్ధి అని బాగా ట్రోల్స్ చేస్తున్నారు.దీనిని బట్టి చూస్తే ఇప్పుడు షన్ను ఫాలోయింగ్ అంతా తగ్గిపోయేలా ఉంది.

తాజా వార్తలు