ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే పార్టీని విడటానికి రెడీ అయ్యారు.
మరోపక్క నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.అధికార పార్టీ వైసీపీపై తీవ్రస్థాయిలో పలు విమర్శలు వస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.రాష్ట్రంలో పీఎం ఆవాసయోజన అమలులో జాప్యం జరుగుతుందని ఆరోపణలు చేశారు.
రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లను కేంద్రం శాంక్షన్ చేస్తే.ఆరు లక్షల ఇల్లే పూర్తయ్యాయని విమర్శించారు.“దేశవ్యాప్తంగా రోజుకు 11వేల ఇళ్లను నిర్మిస్తుంటే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంఖ్య 206గా ఉంది.
దీనికి సీఎం సమాధానం చెప్పాలని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వ పథకానికి… జగనన్న కాలనీ, వైయస్సార్ హౌసెస్ అని పేర్లు పెట్టడం విడ్డూరమని స్పష్టం చేశారు.
దీంతో బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.