విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ఈఓఐలో సింగరేణి తరపున తెలంగాణ ప్రభుత్వం ఎందుకు బిడ్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
యూపీఏ హయాంలో బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టారన్న ఈటల… మోదీ ప్రభుత్వం వచ్చాక మైనింగ్ చట్టాన్ని సవరించారని తెలిపారు.గనులు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు.
దరఖాస్తు చేయకుండా తమకు ఇవ్వలేదని బీఆర్ఎస్ సర్కార్ ఆరోపించడం తగదని పేర్కొన్నారు.తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ ను చేతకాదని ప్రైవేట్ సంస్థకు ఇచ్చారని విమర్శించారు.