తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారని తెలిపారు.
జేపీ నడ్డా, మోదీ నాయకత్వంలో బీజేపీ శక్తివంతంగా మారిందని బండి సంజయ్ వెల్లడించారు.తెలంగాణలో ఏ ఉపఎన్నిక అయినా బీజేపీనే గెలుస్తోందన్నారు.
సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పారు.కేసీఆర్ ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
మోదీని విమర్శిస్తూ కేసీఆర్ టైమ్ పాస్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంతవరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.