2016 లోనే 2019 ఎన్నికల విషయం లో అందరూ కంగారు పడిపోతున్నారు.పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి లో అప్పుడు ఎన్నికలలో పోటీ చేస్తాను అని చెప్పడం తో వారు ఈ హడావిడి లో కొనసాగుతున్నారు.
అతను పూర్తి గా ఎన్నికలలో పోటీ చేస్తాను అని చెప్పిన మరు క్షణం నుంచే ఏ పార్టీకి ఆ పార్టీ అతన్ని తమ వైపు లక్కోవాలి అని చూస్తున్నాయి.ముఖ్యంగా టీడీపీ – బీజేపీ ఈ విషయం లో తీవ్రమైన విభేదాలతో పవన్ ని వశం చేసుకోవడం కోసం చూస్తున్నారు.
గాలి ముద్దు కృష్ణమ నాయుడు మీడియా ముందుకు ఒచ్చి పవన్ తో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పగా, ఇప్పుడు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి పవన్ ని బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తాననడం మంచి విషయమే అని.ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.ఆయన వస్తే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని విష్ణువర్ధన్ పేర్కొన్నారు.
మరోవైపు క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం-భాజపా మధ్య సంబంధాలు తెగిపోయాయని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.