తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.ప్రజల ఓట్లు వేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీని అన్న ఆయన.
జాతీయ పార్టీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు.కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా భారత్ రాష్ట్ర సమితి అంటే అర్ధమేంటో చెప్పాలని, ఏ ఎజెండాతో జాతీయ పార్టీ పెట్టారో అని నిలదీశారు.
కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలన్నదే కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు.ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యలు తెలుసుకోకుండా పరిపాలన చేయాల్సిన సమయంలో.
జాతీయ పార్టీ అంటూ దేశాలు పట్టుకుని తిరగడం ఏంటని ప్రశ్నించారు.పార్టీ పేరు మార్చినందుకు రాజీనామా చేసి సీఎం కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలన్నారు.