కరోనా తర్వాత ఒక్కో సినిమా థియేటర్లో విడుదలవుతూ ఎంతో మంచి విజయాన్ని అందుకొని థియేటర్లకు పూర్వ వైభవం తీసుకువస్తున్నాయి.ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగస్టు నెలలో విడుదలైన సినిమాలు సూపర్ హిట్ అందుకొని దూసుకుపోతున్నాయి.
ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాలు ఐదవ తేదీ విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ కలెక్షన్లు రాబట్టాయి.ఈ విధంగా ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైనప్పటికీ రెండు సినిమాలు భారీ కలెక్షన్లను రాబట్టి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి.
ఇలా థియేటర్లో ఒకేసారి పోటీకి సై అన్న ఈ సినిమాలు థియేటర్ వద్ద మంచి హిట్ కొట్టాయి.ఈ క్రమంలోనే మరోసారి ఈ రెండు సినిమాలు డిజిటల్ మీడియాలో కూడా పోటీకి సిద్ధమయ్యాయి.
ఒక సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేయడం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాని జీ 5 కొనుగోలు చేయగా దుల్కర్ సీతారామం సినిమాని అమెజాన్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న ఈ సంస్థలు ఈ సినిమాలను ఒకేసారి డిజిటల్ మీడియాలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ రెండు సినిమాలను సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు.బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ మంచి విజయం అందుకున్న ఈ సినిమాలు డిజిటల్ మీడియాలో ఎలాంటి ఆదరణ పొందుతాయో తెలియాల్సి ఉంది.







