మొదటి టీకాను మోడీ తీసుకోవాలి

బిహార్ కాంగ్రెస్ ఎం‌ఎల్‌ఏ అజిత్ శర్మ భారత ప్రదాని నరేంద్ర మోడిపై విమర్శలు చేశాడు.

భారత్ లో కరోనా కు వ్యాక్సిన్ రానున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి కావున ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొదటి వ్యాక్సిన్ డోస్ ను దేశ నరేంద్ర మోడీ తీసుకోవాలని డిమాండ్ చేశాడు.ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అమెరికా కాబోయే కొత్త అద్యక్షుడు జో బిడెన్ ను నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు.

వారు తమ తమ దేశ ప్రజల్లో వ్యాక్సిన్ పై అనుమానాలను పోగొట్టడానికి ముందుగా ఆ వ్యాక్సిన్ ను తీసుకున్నారని గుర్తి చేశాడు.అలాగే భారత్ బయో టెక్ సీరం ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ లను బి‌జే‌పి తమ క్రెడిట్ గా చెప్పుకుంటున్నాయని అన్నాడు.ఆ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ ఏర్పడ్డాయని అజిత్ శర్మ గుర్తుచేశాడు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు